Home General News & Current Affairs డ్రోన్ టెక్నాలజీతో వైద్య సేవల విప్లవం: మంగళగిరి ఎయిమ్స్‌లో ఆవిష్కరణ
General News & Current AffairsHealthPolitics & World Affairs

డ్రోన్ టెక్నాలజీతో వైద్య సేవల విప్లవం: మంగళగిరి ఎయిమ్స్‌లో ఆవిష్కరణ

Share
mangalagiri-aiims-drone-services
Share

సాంకేతికంగా ప్రపంచం దూసుకుపోతోంది. టెక్నాలజీ పరంగా అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్ రంగాల్లో మనిషి రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాడు. అయితే ఈ టెక్నాలజీని ఆరోగ్య రంగంలో మిక్స్ చేసి.. అద్భుతాలు సృష్టించేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. డ్రోన్ల ద్వారా ఆరోగ్య, సేవల రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది.

డ్రోన్ల ఉపయోగం వైద్య రంగంలో

ఇక విషయంలోకి వస్తే, డ్రోన్లు అంటే మనందరికీ ఠక్కున గుర్తొచ్చేది నిఘా. గణేష్ ఉత్సవాలు, జాతర్ల సమయంలో డ్రోన్లతో గస్తీ కాయటం చూస్తుంటాం. ఇటీవలి కాలంలో డ్రోన్ల ద్వారా కొన్నిచోట్ల డెలివరీ సేవలు కూడా ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, వైద్య రంగంలో డ్రోన్ల వినియోగం తక్కువగా ఉంది. అయితే, ఆరోగ్య రంగంలో డ్రోన్ల సేవలను ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలు

మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో డ్రోన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డ్రోన్ సేవలను మంగళవారం (అక్టోబర్ 29) ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో డ్రోన్ సేవలను ప్రారంభించారు. అనంతరం ఎయిమ్స్ అధికారులు డ్రోన్ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అందులో భాగంగా, ఎయిమ్స్ నుంచి సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో ఉన్ననూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డ్రోన్‌ను పంపించారు. అక్కడ ఉన్న మహిళా రోగి నుంచి రక్త నమూనాను సేకరించిన తర్వాత, డ్రోన్ ద్వారా ఈ బ్లడ్ శాంపిల్‌ను ఎయిమ్స్ తీసుకువచ్చారు.

డ్రోన్ల ప్రయోజనాలు

  • అత్యవసర సేవలు: అత్యవసర పరిస్థితులలో రోగులకు సేవలు అందించడంలో వేగం పెరుగుతుంది.
  • సరళత: పెద్ద దూరాలను డ్రోన్‌ల ద్వారా వెంటనే చేరవేయడం.
  • అర్ధికంగా ప్రయోజనకరమైనది: సాఫల్యమూ, ఖర్చు తక్కువగా ఉంటుంది.
  • ప్రయోగాత్మకంగా: మొత్తం ఆరోగ్య వ్యవస్థకు అనుకూలంగా ఉండటంతో, గ్రామీణ ప్రాంతాలకు చేరుకోగలదు.

11 ఎయిమ్స్‌లలో ప్రారంభం

ఈ డ్రోన్ సేవలను దేశవ్యాప్తంగా మొత్తం 11 ఎయిమ్స్ లలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్, తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్, ఉత్తరాఖండ్ లోని రిషికేష్ ఎయిమ్స్, అస్సాంలోని గౌహతి ఎయిమ్స్, మధ్యప్రదేశ్ భోపాల్ ఎయిమ్స్, రాజస్థాన్ జోధ్ పూర్ ఎయిమ్స్, బిహార్ పాట్నా ఎయిమ్స్, హిమాచల్ ప్రదేశ్ బిలాస్‌పూర్ ఎయిమ్స్, యూపీలోని రాయ్ బరేలీ ఎయిమ్స్, ఛత్తీస్ ఘడ్‌లోని రాయ్‌పూర్ ఎయిమ్స్, మణిపూర్ ఇంఫాల్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో డ్రోన్ సేవలను ప్రధాని ప్రారంభించారు.

మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్

మరోవైపు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. అందులో భాగంగా, హైదరాబాద్, కాకినాడలో వైద్య పరికరాలు, బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులకు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభోత్సవం చేశారు.

Share

Don't Miss

Ind Vs Eng Updates: టాస్ గెలిచిఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. భారత్ బ్యాటింగ్.. వాంఖడేలో సెమీఫైనల్ హోరాహోరీ!

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ రెండో సెమీఫైనల్ పోరు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభమైంది. Ind Vs Eng Live...

భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్: భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..!!

పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయనే వార్తల నడుమ రష్యా భారత్‌కు...

SSC 10th class hall tickets: ఏపీ, తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. వాట్సప్‌లోనూ పొందండి ఇలా..!

ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల నగారా మోగింది. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న ఈ కీలక పరీక్షల కోసం విద్యాశాఖ తాజాగా AP...

Epfo: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. క్లెయిమ్స్ కోసం కొత్త ఆటోమేషన్ రూల్.. ఈ పని చేస్తేనే అకౌంట్లోకి డబ్బులు!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Epfo) తన సేవలను మరింత ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. గతంలో పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలంటే మాన్యువల్ వెరిఫికేషన్ వల్ల నెలల తరబడి సమయం...

వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి Chandrababu నాయుడు శాసనసభలో కీలక ప్రకటన చేశారు. ఈ దుర్ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని...

Related Articles

భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్: భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..!!

పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. యుద్ధ...

వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి Chandrababu నాయుడు శాసనసభలో...

ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రతీ షాపులో డిజిటల్ పేమెంట్స్ తప్పనిసరి.. కొత్త పాలసీ సిద్ధం!

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాల తీరు పూర్తిగా మారిపోనుంది. రాష్ట్రంలోని మద్యం దుకాణాలు మరియు బార్లలో డిజిటల్...

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం :కన్నతల్లే రెండు నెలల పసికందును నీటి తొట్టిలో ముంచి దారుణ హత్య!

లోకంలో అమ్మ ప్రేమకు మించినది ఏదీ లేదు అంటారు. కానీ, ఆ తల్లి మాత్రం తన...