Home General News & Current Affairs డ్రోన్ టెక్నాలజీతో వైద్య సేవల విప్లవం: మంగళగిరి ఎయిమ్స్‌లో ఆవిష్కరణ
General News & Current AffairsHealthPolitics & World Affairs

డ్రోన్ టెక్నాలజీతో వైద్య సేవల విప్లవం: మంగళగిరి ఎయిమ్స్‌లో ఆవిష్కరణ

Share
mangalagiri-aiims-drone-services
Share

సాంకేతికంగా ప్రపంచం దూసుకుపోతోంది. టెక్నాలజీ పరంగా అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్ రంగాల్లో మనిషి రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాడు. అయితే ఈ టెక్నాలజీని ఆరోగ్య రంగంలో మిక్స్ చేసి.. అద్భుతాలు సృష్టించేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. డ్రోన్ల ద్వారా ఆరోగ్య, సేవల రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది.

డ్రోన్ల ఉపయోగం వైద్య రంగంలో

ఇక విషయంలోకి వస్తే, డ్రోన్లు అంటే మనందరికీ ఠక్కున గుర్తొచ్చేది నిఘా. గణేష్ ఉత్సవాలు, జాతర్ల సమయంలో డ్రోన్లతో గస్తీ కాయటం చూస్తుంటాం. ఇటీవలి కాలంలో డ్రోన్ల ద్వారా కొన్నిచోట్ల డెలివరీ సేవలు కూడా ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, వైద్య రంగంలో డ్రోన్ల వినియోగం తక్కువగా ఉంది. అయితే, ఆరోగ్య రంగంలో డ్రోన్ల సేవలను ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలు

మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో డ్రోన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డ్రోన్ సేవలను మంగళవారం (అక్టోబర్ 29) ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో డ్రోన్ సేవలను ప్రారంభించారు. అనంతరం ఎయిమ్స్ అధికారులు డ్రోన్ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అందులో భాగంగా, ఎయిమ్స్ నుంచి సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో ఉన్ననూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డ్రోన్‌ను పంపించారు. అక్కడ ఉన్న మహిళా రోగి నుంచి రక్త నమూనాను సేకరించిన తర్వాత, డ్రోన్ ద్వారా ఈ బ్లడ్ శాంపిల్‌ను ఎయిమ్స్ తీసుకువచ్చారు.

డ్రోన్ల ప్రయోజనాలు

  • అత్యవసర సేవలు: అత్యవసర పరిస్థితులలో రోగులకు సేవలు అందించడంలో వేగం పెరుగుతుంది.
  • సరళత: పెద్ద దూరాలను డ్రోన్‌ల ద్వారా వెంటనే చేరవేయడం.
  • అర్ధికంగా ప్రయోజనకరమైనది: సాఫల్యమూ, ఖర్చు తక్కువగా ఉంటుంది.
  • ప్రయోగాత్మకంగా: మొత్తం ఆరోగ్య వ్యవస్థకు అనుకూలంగా ఉండటంతో, గ్రామీణ ప్రాంతాలకు చేరుకోగలదు.

11 ఎయిమ్స్‌లలో ప్రారంభం

ఈ డ్రోన్ సేవలను దేశవ్యాప్తంగా మొత్తం 11 ఎయిమ్స్ లలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్, తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్, ఉత్తరాఖండ్ లోని రిషికేష్ ఎయిమ్స్, అస్సాంలోని గౌహతి ఎయిమ్స్, మధ్యప్రదేశ్ భోపాల్ ఎయిమ్స్, రాజస్థాన్ జోధ్ పూర్ ఎయిమ్స్, బిహార్ పాట్నా ఎయిమ్స్, హిమాచల్ ప్రదేశ్ బిలాస్‌పూర్ ఎయిమ్స్, యూపీలోని రాయ్ బరేలీ ఎయిమ్స్, ఛత్తీస్ ఘడ్‌లోని రాయ్‌పూర్ ఎయిమ్స్, మణిపూర్ ఇంఫాల్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో డ్రోన్ సేవలను ప్రధాని ప్రారంభించారు.

మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్

మరోవైపు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. అందులో భాగంగా, హైదరాబాద్, కాకినాడలో వైద్య పరికరాలు, బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులకు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభోత్సవం చేశారు.

Share

Don't Miss

పాకిస్తానీ గూఢచారులు అరెస్ట్ – అమృత్‌సర్‌లో భారత సైన్యానికి లీక్ చేసిన ఇంటి దొంగలు!

భారత సైన్యం సమాచారాన్ని లీక్ చేసిన గూఢచారులు – అమృత్‌సర్‌లో అరెస్ట్  పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్తతలు ముదిరుతున్న నేపథ్యంలో, అమృత్‌సర్‌లో ఇద్దరు పాకిస్తానీ గూఢచారులు పట్టుబడటం దేశ...

జమ్ముకశ్మీర్‌ లోయలో పడ్డ ఆర్మీ వాహనం ముగ్గురు జవాన్లు మృతి.. పలువురికి గాయాలు

జమ్మూ కశ్మీర్ ఆర్మీ వాహనం ప్రమాదం మరోసారి దేశం మొత్తాన్ని విషాదంలోకి నెట్టింది. రాంబన్ జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ నుంచి...

వల్లభనేని వంశీకి జైల్లో అస్వస్థత ఆసుపత్రికి తరలింపు – తిరిగి జైలుకు తరలింపు

వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి తరలింపు అయింది అనే వార్త సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయన శనివారం శ్వాస సమస్యలు,...

జగన్ ఫైర్: ఇదేనా గెలుపు చంద్రబాబు? ప్రజాస్వామ్యంపై తూటాలు వెల్లువెత్తిన జగన్ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి జగన్ విమర్శలు తెరపైకి వచ్చాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అక్రమాలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

అమరావతి రైతులను కోటీశ్వరులను చేస్తున్నాం: చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మళ్లీ ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక, అభివృద్ధికి సంబంధించి కీలక ప్రకటనలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. చంద్రబాబు అమరావతి రైతులను కోటీశ్వరులను చేస్తున్నాం అని ప్రకటించిన...

Related Articles

పాకిస్తానీ గూఢచారులు అరెస్ట్ – అమృత్‌సర్‌లో భారత సైన్యానికి లీక్ చేసిన ఇంటి దొంగలు!

భారత సైన్యం సమాచారాన్ని లీక్ చేసిన గూఢచారులు – అమృత్‌సర్‌లో అరెస్ట్  పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత...

జమ్ముకశ్మీర్‌ లోయలో పడ్డ ఆర్మీ వాహనం ముగ్గురు జవాన్లు మృతి.. పలువురికి గాయాలు

జమ్మూ కశ్మీర్ ఆర్మీ వాహనం ప్రమాదం మరోసారి దేశం మొత్తాన్ని విషాదంలోకి నెట్టింది. రాంబన్ జిల్లాలో...

వల్లభనేని వంశీకి జైల్లో అస్వస్థత ఆసుపత్రికి తరలింపు – తిరిగి జైలుకు తరలింపు

వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి తరలింపు అయింది అనే వార్త సోషల్...

జగన్ ఫైర్: ఇదేనా గెలుపు చంద్రబాబు? ప్రజాస్వామ్యంపై తూటాలు వెల్లువెత్తిన జగన్ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి జగన్ విమర్శలు తెరపైకి వచ్చాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో...